Do Children "Pay" for their Parents 'Sin'? |
పిల్లలు తమ తల్లిదండ్రుల పాపానికి మూల్యం చెల్లిస్తారా?
తల్లిదండ్రులు చేసిన పాపాలకు పిల్లలు శిక్షించబడరు; వారి పిల్లల పాపాలకు తల్లిదండ్రులు శిక్షించబడరు. మనలో ప్రతి ఒక్కరూ మన స్వంత పాపాలకు బాధ్యత వహిస్తారు.
యెహెజ్కేలు 18:20 మనకు ఇలా చెబుతోంది, “పాపము చేయువాడే మరణము నొందును; తండ్రియొక్క దోష శిక్షను కుమారుడు మోయుటలేదని, కుమారుని దోష శిక్షను తండ్రిమోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును.” ఒకరి పాపాలకు శిక్ష ఆ వ్యక్తే భరించాలని ఈ వాక్యము reference స్పష్టంగా చూపిస్తుంది.
Understanding the Generational Curse of Exodus :
పాపానికి తరతరాల శిక్ష లేదా తరతరాల శాపాన్ని కొందరు విశ్వసించే వాక్యములు ఉన్నాయి. ఈ వచనాలలో ఒకటి నిర్గమకాండము 20:5, “మీరు [విగ్రహాలకు] నమస్కరించకూడదు లేదా వాటిని ఆరాధించకూడదు; మీ దేవుడైన యెహోవానైన నేను రోషము గల దేవుణ్ణి, నన్ను ద్వేషించేవారిలో మూడవ మరియు నాల్గవ తరం వరకు తండ్రుల పాపానికి పిల్లలను శిక్షిస్తాను".
నిర్గమకాండము 20:5ని సందర్భోచితంగా ఉంచడం ద్వారా, దేవుడు విగ్రహారాధన యొక్క పాపాన్ని సూచిస్తున్నట్లు మనం వెంటనే గమనించవచ్చు. దేవుడు విగ్రహారాధనను పవిత్రమైన నమ్మకానికి అత్యంత నమ్మకద్రోహంగా భావించాడు. విగ్రహారాధకులు దేవుని దైవపరిపాలనకు ద్రోహులు. పాత నిబంధన (ద్వితీయోపదేశకాండము 12:31 చూడండి)లో విగ్రహారాధనతో పాటుగా ఉన్న అసహ్యమైన ఆచారాలతోపాటు, విగ్రహారాధన ఒక సంస్కృతిలో తనకంటూ ఒక మార్గాన్ని కలిగి ఉంది. అటువంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు సంప్రదాయాన్ని కొనసాగిస్తారు మరియు అదే విధమైన విగ్రహారాధనను ఆచరిస్తారు, తద్వారా అవిధేయతలోకి పడిపోతారు. ఒక అవిధేయత తరం యొక్క ప్రభావం ఏమిటంటే, దుష్టత్వం చాలా లోతుగా వేళ్ళూనుకుంటుంది, అది తిరగడానికి అనేక తరాలు పడుతోంది.
నిర్గమకాండము 20:5 యొక్క అంతరార్థం ఏమిటంటే పిల్లలు వారి తల్లిదండ్రులతో సమానంగా ఉంటారు. కొత్త తరం వారి పూర్వీకుల పాపాలను పునరావృతం చేస్తుంది. కాబట్టి, దేవుడు “పిల్లలను శిక్షించడం” అనేది పిల్లలు తండ్రుల పాపాలను పునరావృతం చేస్తున్నారని చెప్పడానికి మరొక మార్గం. చరిత్రలోని తప్పులను పునరావృతం చేసే ధోరణి ముఖ్యంగా విగ్రహారాధన సంస్కృతిలో బలంగా ఉంది.
మరొక పరిశీలన ఏమిటంటే, నిర్గమకాండము 20:5 హెచ్చరిక పాత నిబంధనలో ఇజ్రాయెల్ను పరిపాలించే మోషే ధర్మశాస్త్రంలో భాగం. తరాల శాపాన్ని వ్యక్తిగత కుటుంబాలపై వ్యక్తిగత శాపంగా కాకుండా దేశంపై సామూహిక శిక్షగా చూడాలి.
ఉదాహరణ కి ఒక వ్యక్తి బ్యాంకును దోచుకుంటే, ఆ కుమారుడికి ఆ దోపిడీతో ఎలాంటి సంబంధం లేనప్పటికీ, దేవుడు ఆ వ్యక్తి కొడుకును శిక్షిస్తాడా? ఖచ్చితంగా కాదు. ఏదేమైనా, బ్యాంకును దోచుకున్న తండ్రి తన నేరం యొక్క సహజ పరిణామాల ద్వారా తన కొడుకు జీవితాన్ని మరింత కష్టతరం చేసే అవకాశం ఉంది. అలాగే, ఒక వ్యక్తి తన కొడుకుకు బ్యాంకు దోపిడీకి సంబంధించిన మెళుకువలను శిక్షణ ఇస్తుంటే, కొడుకు కూడా అదే మార్గాన్ని అనుసరించే అవకాశం ఉంది. అలాంటప్పుడు, పాపం కొడుకు చేత కాపీ చేయబడి, పాపానికి శిక్ష వస్తుంది.
కాబట్టి, యెహెజ్కేలు 18:20 చూపినట్లుగా, మనలో ప్రతి ఒక్కరూ మన స్వంత పాపాలకు బాధ్యత వహిస్తారు మరియు వాటి కోసం మనం శిక్షను భరించాలి. మన అపరాధాన్ని మనం మరొకరితో పంచుకోలేము, అలాగే మన ధోషాలకీ, అతిక్రమాలకీ మరొకరు బాధ్యత వహించలేరు.
అయితే, ఈ నియమానికి ఒక మినహాయింపు ఉంది మరియు ఇది మొత్తం మానవాళికి వర్తిస్తుంది. ఒక వ్యక్తి ఇతరుల పాపాలను భరించాడు మరియు వారి కోసం శిక్షను చెల్లించాడు, తద్వారా పాపులు దేవుని దృష్టిలో పూర్తిగా నీతిమంతులు మరియు పవిత్రులుగా మారవచ్చు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు, మన పాపానికి తన పరిపూర్ణతను మార్చుకోవడానికి ప్రపంచంలోకి వచ్చాడు. "మనము ఆయనయందు దేవుని నీతిగా ఉండునట్లు దేవుడు పాపము లేని వానిని మన కొరకు పాపముగా చేసాడు.
Watch this Video by RRK Murty Garu.. ఈ అంశం పై RRK మూర్తి గారు మాట్లాడిన ఈ వీడియో
చూడండి..
Listen to this English Audio..
" (2 కొరింథీయులకు 5:21). యేసు మన కొరకు శిక్షించబడ్డాడు.
యెహెజ్కేలు 18వ మొత్తం అధ్యాయం వివరణ:
1 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది:
2 ✽ “మీరు ఇలా అంటారు గదా, ‘తండ్రులు పుల్లని ద్రాక్షకాయలు తిన్నారు, పిల్లల పళ్ళు పులిశాయి’ అని. ఆ సామెత ఇస్రాయేల్ దేశాన్ని గురించి చెపుతున్నారేమిటి?
ప్రవాసులు తమ పైకి వచ్చిన విపత్తులు తమ పాపాల కారణంగా కాదనీ, తమ తండ్రుల పాపాల వల్లేననీ భావించారు. ఎప్పుడూ తాము చేసిన పాపాలకు బాధ్యత మరొకరి మీదికి నెట్టెయ్యడం, లేదా పరిస్థితుల ప్రభావం అనో, కర్మ అనో సరిపెట్టెయ్యడమే మానవ స్వభావం.
3 మీరు ఇకనుంచి ఇస్రాయేల్లో ఆ సామెత చెప్పరని నా జీవంతోడు నేనే – యెహోవాప్రభువును – పలుకుతున్నాను.
4 ✽అందరూ నా స్వాధీనంలో ఉన్నారు. తండ్రులూ కొడుకులూ అందరూ నా స్వాధీనంలో ఉన్నారు. ఎవడైతే అపరాధం చేస్తాడో వాడే చస్తాడు.
18:4 దేవుని వాక్కులో కనిపించే ఒక గొప్ప నియమం ఇది. దేవుడు ప్రతి మనిషినీ వ్యక్తిగతంగా చూస్తాడు. అందరూ ఆయన సొత్తు. జీవన్మరణాలనే కీలకమైన విషయాలు న్యాయమైన ఆయన చేతుల్లోనే ఉన్నాయి. తమ తండ్రుల పాపాల మూలంగా పిల్లలు బాధలను అనుభవిస్తారన్నది నిజమే (నిర్గమ 34:6, 8). ఏదో విధంగా కొంతవరకైనా పిల్లలు కూడా తండ్రుల అపరాధంలో భాగస్థులే (రోమ్ 5:12-18) అయితే వ్యక్తిగతంగా వారు హఠాత్తుగా నాశనమైపోవడం, లేదా తండ్రుల పాపాలవల్ల నరకానికి పోవడం అనే తీర్పుకు గురి కారు. మనుషులకు తీర్పు తీర్చడంలో దేవుడు ఒక వ్యక్తి ఏం చేశాడు లేక ఏం చెయ్యలేదు అన్న విషయాన్నే లెక్కలోకి తీసుకుంటాడు (వ 30).
5 ✽“న్యాయవంతుడొకడు ఉన్నాడు. అతడు నీతి న్యాయాలను అనుసరిస్తాడు.
18:5-29 దేవుడు ప్రతి మనిషిపట్ల వ్యక్తిగతంగా వ్యవహరిస్తాడనీ మరొకడి అపరాధాలకు అతణ్ణి హఠాత్తుగా నాశనం చెయ్యడనీ తెలియజేసే ఉదాహరణలు.
6 కొండలమీద భోం చేయకుండా, ఇస్రాయేల్ప్రజలు పెట్టుకొన్న విగ్రహాలవైపు చూడకుండా ఉంటాడు. పొరుగువాడి భార్యను పాడు చేయడు. రుతు కాలంలో ఉన్న స్త్రీతో శయనించడు. 7 ✝✽ఎవరినీ బాధించడు గాని అప్పు తీసుకున్నవాడికి తాకట్టు మళ్ళీ ఇస్తాడు. ఎవరి వస్తువులనూ దోచుకోడు. ఆకలి ఉన్నవారికి ఆహారం, బట్టలు లేనివారికి బట్టలు ఇస్తాడు. 8 ✝వడ్డీకి అప్పివ్వడు, అప్పివ్వడంవల్ల లాభమేమీ చేకూర్చుకోడు. అన్యాయం చేయడు, పక్షపాతం లేకుండా అందరిపట్ల న్యాయం జరిగిస్తాడు. 9 ✝అతడు నమ్మకంగా నా చట్టాలను పాటిస్తూ, నా న్యాయ నిర్ణయాలను అనుసరిస్తూ ఉంటాడు. అలాంటివాడు న్యాయవంతుడు. అతడు తప్పనిసరిగా బ్రతుకుతాడు. ఇది యెహోవా వాక్కు.
10 ✽“ఆ న్యాయవంతునికి పుట్టిన కొడుకు దౌర్జన్యం, హత్య చేసేవాడనుకోండి. చేయవలసినవాటిలో దేనిని చేయక, చేయరానివాటిలో దేనినైనా చేస్తాడనుకోండి. 11 కొండలమీద భోం చేస్తాడు. పొరుగువాడి భార్యను అశుద్ధం చేస్తాడు. 12 దీనావస్థలో అక్కరలో ఉన్నవారిని బాధిస్తాడు, దోచుకొంటాడు. తాకట్టు మళ్ళీ ఇవ్వకుండా ఉంటాడు. విగ్రహాల వైపు చూస్తాడు. అసహ్య కార్యాలు చేస్తాడు. 13 వడ్డీకి అప్పిస్తాడు. అప్పివ్వడంవల్ల లాభం చేకూర్చుకొంటాడు. అలాంటివాడు బ్రతుకుతాడా? బ్రతకడు! ఆ అసహ్యకరమైన కార్యాలన్నీ చేసినందుచేత వాడు తప్పకుండా మరణశిక్షకు గురి అవుతాడు. వాడి మృతికి వాడే బాధ్యుడు.
18:10-13 కొడుకు తన తండ్రి నీతిన్యాయాలను వారసత్వంగా పొందడు. అతడు పాపంలో జీవిస్తే ఆ దోషం వ్యక్తిగతంగా అతనిదే. దాన్ని బట్టి అతనే చనిపోతాడు.
14 ✽“అయితే ఆ కొడుకుకు పుట్టిన కొడుకు తన తండ్రి చేసిన పాపాలన్నీ చూచినా అలాంటివాటిని చేయకుండా ఉంటాడనుకోండి.
18:14-20 ఇప్పుడు మూడో తరం గురించిన విషయం. నిర్గమ 20:5; 34:7 పోల్చి చూడండి. నాలుగు తరాల పిల్లలు వాళ్ళ పూర్వీకుల పాపాలు చేస్తేనే వాళ్ళ పూర్వీకులలాగా శిక్షకు గురి అవుతారు. వారలా చెయ్యకుంటే దేవుని తీర్పునుండి తప్పించుకుంటారు (వ 20).
15 కొండలమీద భోం చేయడు. ఇస్రాయేల్ప్రజలు పెట్టుకొన్న విగ్రహాలవైపు చూడడు. పొరుగువాడి భార్యను అశుద్ధం చేయడు. 16 ఎవరినీ బాధించడు, తాకట్టు ఉంచుకోడు, దోచుకోడు. ఆకలి ఉన్నవారికి ఆహారం, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తాడు. 17 బీదవారిమీద అన్యాయంగా చెయ్యి వేయడు. వడ్డీకి అప్పియ్యడు. అప్పివ్వడంవల్ల లాభం చేకూర్చుకోడు. నా న్యాయనిర్ణయాలను అనుసరిస్తూ, నా చట్టాలను పాటిస్తూ ఉంటాడు. తన తండ్రి చేసిన అపరాధాల కారణంగా అలాంటివాడు చావడు. అతడు తప్పక బ్రతుకుతాడు. 18 కాని, అతడి తండ్రి దౌర్జన్యపరుడై పొరుగువాని వస్తువులను దోచుకొంటూ, తన ప్రజలమధ్య చెడుగు చేస్తూ ఉండేవాడు గనుక తాను చేసిన అపరాధాల కారణంగా వాడే చస్తాడు.
19 “అయితే మీరు ‘తండ్రి చేసిన అపరాధంచేత కొడుకు ఎందుకు శిక్షకు గురి కాడు?’ అని అడుగుతారు. కొడుకు నీతిన్యాయాలను అనుసరిస్తూ నా చట్టాలన్నిటినీ పాటిస్తూ అనుసరిస్తూ ఉన్నాడు గనుక అతడు తప్పనిసరిగా బ్రతుకుతాడు. 20 అపరాధం చేస్తూ ఉండేవాడే చస్తాడు. తండ్రి అపరాధం కారణంగా కొడుకు శిక్షకు గురి కాడు. కొడుకు కారణంగా తండ్రి శిక్షకు గురి కాడు. న్యాయవంతుడి న్యాయప్రవర్తన అతడికే చెందుతుంది, దుర్మార్గుడి దుర్మార్గం అతడికే చెందుతుంది.
21 ✽“అయితే దుర్మార్గుడు తాను చేసిన అపరాధాలన్నిటినీ వదలిపెట్టి నా చట్టాలన్నిటినీ అనుసరించి నీతిన్యాయాల ప్రకారం ప్రవర్తిస్తే, అతడు తప్పనిసరిగా బ్రతుకుతాడు. అతడు చావడు. 22 అతడు చేసిన అపరాధాలలో ఒకటి కూడా జ్ఞప్తికి రాదు. అతడి న్యాయ ప్రవర్తన కారణంగా బ్రతుకుతాడు.
18:21-22 14-20 వచనాల ప్రకారం ఒక తరంలోని పాపాలను మరో తరంలో జయించేందుకు అవకాశం ఉంది. ఈ వచనంలో అయితే ఏ తరంలోని పాపాలను ఆ తరంలో వారే విసర్జించడానికి అవకాశం ఉందని తెలుసుకుంటున్నాం. ఒక మనిషి కర్మ అని పిలిచేదానికీ, దీనికి ఏ సంబంధమూ లేదు. 21వ వచనం సంపూర్ణ పశ్చాత్తాపాన్ని గురించి చెప్తున్నది. యెషయా 55:7 పోల్చి చూడండి. 22వ వచనంలో పాపక్షమాపణ ఒక వ్యక్తి పాపాలను పూర్తిగా తుడిచి పెట్టివెయ్యడం కనిపిస్తున్నది. కీర్తన 103:12; యెషయా 44:22; మీకా 7:18-19 చూడండి.
23 ✽ దుర్మార్గుడు చస్తే నాకేమైనా సంతోషం కలుగుతుందా? నాకు సంతోషం కలిగించేదేమిటంటే, దుర్మార్గులు తమ దుర్మార్గాలను వదలిపెట్టి బ్రతకడమే గదా. ఇది యెహోవాప్రభువు వాక్కు.
18:23 వ 32; 33:11. దేవుడు ప్రేమ స్వరూపి. శిక్షించడంలో ఆయనకు ఆసక్తి లేదు. క్షమించడమే ఆయనకు ఇష్టం (యోవేలు 2:13; 2 పేతురు 3:9). మనుషులపట్ల ఆయన జాలి లేకుండా అకారణంగా మరణం గానీ శాశ్వత శిక్ష గానీ ఎవరికీ విధించడు. పశ్చాత్తాపంతో మనుషులు తనవైపు తిరగడంకంటే మరేదైనా ఆయనకు ఎక్కువ ఆనందం కలిగిస్తుందా (లూకా 15:7, 10)? ఆయనవైపు తిరిగి, విముక్తీ క్షమాపణా పొందినవారిని బట్టి ఆయన ఉల్లాసంతో ఉప్పొంగిపోతాడు (జెఫన్యా 3:17; కీర్తన 147:11).
24 ✽న్యాయవంతుడు నీతిన్యాయాలను వదలివేసి అపరాధి అయి, దుర్మార్గులు చేసే అసహ్యకార్యాలను చేస్తూ ఉంటే అతడు బ్రతుకుతాడా? మునుపు నీతిన్యాయాలను అనుసరించి చేసిన క్రియలు నా జ్ఞప్తికి రావు. అతడు ద్రోహి అయి చేసిన అపరాధాల కారణంగా చస్తాడు.
18:24 ఇక్కడి అర్థం దేవుని బిడ్డ ఆయన కృపమూలంగా పాపవిముక్తీ శాశ్వత జీవాన్నీ పొందిన తరువాత ఆ శాశ్వత జీవాన్ని పోగొట్టుకొని నరకానికి పోతాడని కాదు. అలా అనుకోవడం యోహాను 10:28, తదితర వచనాలకు వ్యతిరేకం అవుతుంది. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో రాసివున్నది శాశ్వత జీవం లేక శాశ్వత శిక్షలను గురించి కాదు. అవి పాత ఒడంబడిక అంతట్లో కనబడడం అరుదు. ఇక్కడి సందర్భం ఇస్రాయేల్ పై దేవుని తీర్పు, జెరుసలం నాశనం, అందులోని అనేకమంది వధ, మరి కొందరి ప్రవాసం. ఆ పరిస్థితుల దృష్ట్యా మరణం దేవుని శిక్ష, బ్రతికి ఉండడం దేవుని అనుగ్రహం.
25 ✽ “అయినా, మీరు ‘యెహోవా విధానం న్యాయం కాదు’ అంటారు. ఇస్రాయేల్ ప్రజలారా, నేను చెప్పేది వినండి! నా విధానం న్యాయం కాదా? అన్యాయ విధానాలు మీవే గదా.
26 ✽న్యాయవంతుడు నీతిన్యాయాలను వదలివేసి అక్రమం చేస్తూ ఉంటే, అతడు దానికారణంగా చస్తాడు. అతడు చేసిన అక్రమాల కారణంగానే చస్తాడు. 27 దుర్మార్గుడు తాను చేస్తూ వచ్చిన చెడును విసర్జించి నీతిన్యాయాల ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటే, అతడు ప్రాణం దక్కించుకొంటాడు. 28 తాను చేస్తూ వచ్చిన అతిక్రమాలన్నిటి విషయం ఆలోచించి వాటిని విసర్జించడం కారణంగా అతడు తప్పనిసరిగా బ్రతుకుతాడు. అతడు చావడు. 29 అయినా, ఇస్రాయేల్ప్రజలు ‘యెహోవా విధానం న్యాయం కాదు’ అంటారు. ఇస్రాయేల్ప్రజలారా, నా విధానం న్యాయసమ్మతం కాదా? అన్యాయ విధానాలు మీవే గదా. 30 ✽అందుచేత, ఇస్రాయేల్ ప్రజలారా, నేను ప్రతివాడికీ అతడి ప్రవర్తన ప్రకారం తీర్పు తీరుస్తాను. ఇది యెహోవా వాక్కు.
0 కామెంట్లు